ఖైరతాబాద్లో 1.5 సెం.మీ నమోదు
మరో 2 రోజులు వర్షసూచన
సిటీబ్యూరో, జూన్ 25 (నమస్తే తెలంగాణ): రుతుపవనాల ప్రభావంతో గ్రేటర్లోని పలు చోట్ల శనివారం సాయంత్రం తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసింది. రాత్రి 9 గంటల వరకు ఖైరతాబాద్లో 1.5 సెం.మీలు, షేక్పేటలో 6.0 మిల్లీమీటర్లు, నాంపల్లి, రామంతాపూర్, సికింద్రాబాద్, ఆసిఫ్నగర్, నారాయణగూడ, బంజారాహిల్స్ ప్రాంతాల్లో 5.3 మిల్లీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీఎస్డీపీఎస్ అధికారులు వెల్లడించారు.
వీటితో పాటు ముషీరాబాద్, హిమాయత్నగర్, కాచిగూడ, గుడిమల్కాపూర్ తదితర ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసినట్లు వెల్లడించారు. రుతుపవనాల ప్రభావంతో రాగల 48గంటల్లో గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.