హైదరాబాద్ : నగరంలోని శనివారం రాత్రి పలు చోట్ల కుండపోత వర్షం కురుస్తోంది. మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, అంబర్పేట, కాచ్చిగూడ, నల్లకుంట, గోల్నాకలో వాన పడుతున్నది. ఖైరతాబాద్, హిమాయత్నగర్, పంజాగుట్ట, అమీర్పేట, మైత్రివనం, ఆర్టీసీ క్రాస్రోడ్, లక్డీకాపూల్, ఎల్బీనగర్, కోఠీ, అబిడ్స్, సరూర్నగర్, సైదాబాద్, ఉప్పల్, దిల్సుఖ్నగర్, కూకట్పల్లి, ఆల్విన్కాలనీ, హైరదాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ప్రగతినగర్, నిజాంపేట, చంపాపేట, రామంతాపూర్, బోడుప్పల్, పీర్జాదిగూడ, మేడిపల్లి, జీడిమెట్ల, బాలానగర్, దుండిగల్, కుత్బుల్లాపూర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నది. అయితే, నగరంలో రాత్రి 9 గంటల వరకు వర్షం పడుతుందని జీహెచ్ఎంసీ తెలిపింది. నగరవాసులు ఇండ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది. అత్యవసర సమయంలో సాయం కోసం 040-29555500 నంబర్లో సంప్రదించాలని కోరింది.
కుండపోత వానకు నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అంబర్పేట మూసారాంబాగ్ వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తున్నది. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అలాగే గచ్చిబౌలి – మెహిదీపట్నం మార్గంలోనూ భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వర్షానికి రాయదుర్గం వద్ద రహదారిపై భారీగా వరద నీరు నిలిచింది. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు వాహనాలను నార్సింగ్ వైపు మళ్లిస్తున్నారు. జాబ్లీహిల్స్ చెక్పోస్ట్, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మధ్య సైతం వాహనాలు నిలిచిపోయాయి. మరో వైపు వర్షాల నేపథ్యంలో మేయర్ విజయలక్ష్మి అధికారులను అప్రమత్తం చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.