హైదరాబాద్ : రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడిందని, సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని పేర్కొంది. ఆవర్తనం పశ్చిమ – వాయువ్య దిశగా ప్రయాణించి.. రేపటి వరకు ఉత్తర ఒడిశా, బెంగాల్ తీరాలకు చేరుకునే అవకాశం ఉందని చెప్పింది. పశ్చిమ దిశగా రాష్ట్రంలోకి కిందిస్థాయి గాలులు వీస్తున్నాయని.. దీంతో శుక్ర, శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆదివారం ఉరుములు, మెరుపులతో వర్షం పడుతుందని, ఈ నెల 20, 21న ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.