హైదరాబాద్ : రాబోయే మూడు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సిద్దిపేట, జనగామ, యాదాద్రి, ఖమ్మం, మెదక్, సూర్యాపేట, సంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో మోస్తరు వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. 30-40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. నిన్న హైదరాబాద్తో పాటు ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. పలు చోట్ల భారీగా వడగళ్లు కురిశాయి.