అవినీతి, కుంభకోణాలకు ఆది గురువు
రాహుల్ అపరిపక్వ, అసమర్థ నాయకుడు
వరంగల్ హామీలు కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో అమలుచేయాలి
ప్రభుత్వ విప్ బాల్క సుమన్ డిమాండ్
హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): ప్రజలు తమను నమ్మే పరిస్థితి లేదని గుర్తించిన కాంగ్రెస్ దగుల్బాజీ నేతలు సరికొత్త డ్రామాలకు తెరలేపారని ప్ర భుత్వ విప్ బాల్క సుమన్ ఆగ్ర హం వ్యక్తంచేశారు. ఆదివారం ఆయన టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడు తూ.. అమరవీరుల స్మృతివనం, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని సైతం వివాదాల్లోకి లాగే దుర్మార్గానికి పీపీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఒడిగట్టారని మండిపడ్డారు. అమరవీరుల స్మృతివనాన్ని సందర్శించే, దాని గురించే మాట్లాడే నైతికహక్కు రాహుల్గాంధీ, రేవంత్రెడ్డికి లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ సభల్లో అమరవీరులకు కనీసం నివాళి అర్పించనివారు స్మ తివనంలో అవినీతి జరిగిందనడం సిగ్గుచేటని మం డిపడ్డారు. పంచభూతాలను మింగిన కాంగ్రెస్ అన్ని కుంభకోణాలకు, అవినీతికి ఆది గురువు అని దుమ్మెత్తిపోశారు. టీఆర్ఎస్ పాలనలో అవినీతి జరిగితే ఆధారాలతో బయటపెట్టాలని సవాల్ చేశారు. చంచల్గూడ జైల్లో చిప్పకూడు తిన్న రేవంత్రెడ్డికి కేటీఆర్ గురించి మాట్లాడే హక్కు లేదని చెప్పారు.
రాహుల్గాంధీ అపరిపక్వ నేత
రాహుల్గాంధీ అపరిపక్వ, అసమర్థ నేత అని బాల్క సుమన్ విమర్శించారు. కాంగ్రెస్వి చిల్లర రాజకీయాలని రాహుల్ పర్యటనతో తేలిపోయిందని చెప్పారు. దమ్ముంటే వరంగల్ సభలో ప్రకటించిన హామీలన్నీ కాంగ్రెస్ పాలిత రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు.
జాతీయపార్టీలకు స్థానం లేదు
దేశాన్ని అన్ని రంగాల్లో సర్వనాశనం చేసిన కాంగ్రెస్, బీజేపీకి రాష్ట్రంలో స్థానం లేదని సుమన్ పేర్కొన్నారు. రాహుల్, మోదీ, రేవంత్, బండి సంజయ్ ఎన్నివేషాలు వేసినా, ఎం త రెచ్చగొట్టినా తెలంగాణ ప్రజలు నమ్మరన్నారు.
బీజేపీలోకి రేవంత్?
బీజేపీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువైనందునే బండి సంజయ్ పాదయాత్ర పేరుతో తిరుగుతున్నాడని బీజేపీ నేతలు చెప్పుకొంటున్నట్టు బాల్క సుమన్ ఆరోపించారు. గ్రూపు తగాదాల వల్లే కిషన్రెడ్డి రేవంత్రెడ్డిని బీజేపీలోకి తీసుకొ చ్చేందుకు యత్నిస్తున్నారని పార్టీ నేతలు గుసగుసలాడుతున్నారని తెలిపారు.