న్యూఢిల్లీ : లేబర్ పార్టీ నేత, గతంలో భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన జెరెమి కార్బిన్తో బ్రిటన్లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భేటీ కావడం విమర్శలకు తావిస్తోంది. కార్బిన్ గతంలో భారత్ వ్యతిరేక, హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. భారత్ నుంచి కశ్మీర్ను వేరుచేయాలని కూడా ఆయన సలహా ఇచ్చారు. లండన్లో జెరెమి కార్బిన్తో రాహుల్ గాంధీ ఏం చేస్తున్నారని కార్బిన్తో కాంగ్రెస్ ఎంపీ కలిసి ఉన్న ఫోటోను ట్వీట్ చేస్తూ బీజేపీ నేత కపిల్ మిశ్రా ప్రశ్నించారు.
బ్రిటన్ ఎంపీతో రాహుల్ భేటీని బీజేపీ జాతీయ ప్రతినిధి షెహజాద్ పూనావాలా కూడా ప్రస్తావిస్తూ భారత వ్యతిరేక శక్తులతో రాహుల్ ఎందుకు సమావేశమయ్యారని నిలదీశారు. బ్రిటన్ ఎంపీతో రాహుల్ ఫోటోను కూడా పూనావాలా షేర్ చేశారు. దేశానికి వ్యతిరేకంగా వ్యవహరించే వారితో రాహుల్ గాంధీ ఎందుకు ఎప్పుడూ చేతులు కలుపుతుంటారని ప్రశ్నించారు.
గతంలో కశ్మీర్పై జెరెమి కార్బిన్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ కూడా తోసిపుచ్చింది. ఇక భారత్ గొంతుక వినిపించే వ్యవస్ధలపై పద్ధతి ప్రకారం దాడులు జరుగుతున్నాయని రాహుల్ గాంధీ మోదీ సర్కార్పై విరుచుకుపడ్డారు. దేశంలో సంప్రదింపుల ప్రక్రియ జరిగే విధానాన్ని కేంద్ర పాలకులు మార్చేస్తున్నారని దుయ్యబట్టారు.