ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ కోసం విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు సుమారు మూడు నెలల పాటు ఇంగ్లాండ్లోనే ఉండనుంది. ఈ జట్టుతో పాటే హెడ్కోచ్ రవిశాస్త్రి, సహాయ కోచింగ్ సిబ్బంది అక్కడికి వెళ్లనుంది. ఆ సమయంలో భారత జట్టు పరిమిత ఓవర్ల సిరీస్ కోసం శ్రీలంక టూర్కు బయల్దేరనుంది. జూలైలో లంక సిరీస్లో భారత క్రికెటర్లకు ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడ్ను పంపాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలిసింది.
ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ కోసం విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు సుమారు మూడు నెలల పాటు ఇంగ్లాండ్లోనే ఉండనుంది. ఈ జట్టుతో పాటే హెడ్కోచ్ రవిశాస్త్రి, సహాయ కోచింగ్ సిబ్బంది అక్కడికి వెళ్లనుంది. ఆ సమయంలో భారత జట్టు పరిమిత ఓవర్ల సిరీస్ కోసం శ్రీలంక టూర్కు బయల్దేరనుంది. జూలైలో లంక సిరీస్లో భారత క్రికెటర్లకు ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడ్ను పంపాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలిసింది.
ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)కు రాహుల్ డైరెక్టర్గా ఉన్నాడు.
ఎన్సీఏ చీఫ్గా ఉన్న ద్రవిడ్ తన సహాయకు సిబ్బందిలో కొంతమందిని సిరీస్లో కోచ్లుగా తీసుకునే అవకాశం ఉంది. లంక పర్యటనలో భారత్ 3 వన్డేలు, 3టీ20లు ఆడనుంది. టూర్ కోసం వేరే జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేయనుంది.
లంక పర్యటనకు అందుబాటులో ఉన్న ఆటగాళ్లను సెలక్ట్ చేస్తారు. శిఖర్ ధావన్, పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, నవదీప్ సైని, ఖలీల్ అహ్మద్, చాహల్, కుల్దీప్ యాదవ్ తదితరులకు అవకాశం దక్కనుంది.