న్యూఢిల్లీ: ప్రకాశ్ జావడేకర్ తర్వాత మరో కేంద్రమంత్రి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలపై ధ్వజమెత్తారు. బాధ్యత గల దేశప్రజలు ప్రధాని మోదీతో కలిసి దేశ ఆర్థికవృద్ధికి ఇంటినుండే పనిచేస్తూ కృషి చేస్తున్నారని, రాహుల్ గాంధీ మాత్రం మతిలేని మాటలతో విలువైన ఇంటర్నెట్ సౌకర్యాన్ని వృథా చేస్తున్నారని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మండిపడ్డారు. రాహుల్ వల్ల దేశానికి కలిగే మేలు ఇదొక్కటేనని ట్విట్టర్లో పేర్కొన్నారు. కరోనా సెకండ్వేవ్కు ప్రధాని నరేంద్రమోదీ బాధ్యుడని, ఆయన ఇప్పటికీ తన ఇమేజీ కోసం తమాషాలు చేస్తున్నారని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై సమాచార ప్రసార శాఖామంత్రి ప్రకాశ్ జావడేకర్ కూడా విరుచుకుపడ్డారు. ప్రధాని తమాషా చేస్తున్నారని అనడం భావ్యం కాదన్నారు. కాంగ్రెస్ తమాషాకు ప్రజలు ఎప్పుడో మంగళం పాడారని జావడేకర్ అన్నారు.