హైదరాబాద్: హైదరాబాద్లో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. డీసీఎంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. ఒడిశాలోని మల్కాన్గిరి నుంచి ముంబైకి గంజాయిని తరలిస్తున్న నలుగురిని ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వారివద్ద లభించిన 900 కిలోల గంజాయిని సీజ్ చేశారు. దీనివిలువ సుమారు రూ.2 కోట్లు ఉంటుందని చెప్పారు. నిందితుల నుంచి డీసీఎం, ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.