సిటీబ్యూరో, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తానంటూ అమాయకులను మోసం చేస్తున్న నేరగాడిపై పీడీ యాక్టు ప్రయోగిస్తూ రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
యాతాకుల ప్రమోద్కుమార్ మరో ముగ్గురితో కలిసి ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తామంటూ నమ్మించి మోసాలకు పాల్పడ్డారు. గత ఏడాది నవంబర్ నెలలో హయత్నగర్ పోలీసులు ఈ ముఠాను అరెస్ట్ చేశారు. కాగా, ఈ ముఠా తన నేరప్రవృత్తిని మానుకోలేదు. దీంతో తాజాగా ముఠాలోని ప్రమోద్కుమార్పై పీడీ యాక్ట్ను ప్రయోగిస్తూ సీపీ ఆదేశాలు జారీ చేశారు.