హైదరాబాద్ : కార్ల విక్రయం పేరుతో మోసాలు చేస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. నిజామాబాద్ వాసి శ్రీకాంత్తో పాటు భోపాల్కు చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. తక్కువ ధరకు కార్లు అమ్ముతామంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు గుప్పించి ముఠా సభ్యులు మోసాలకు పాల్పడుతున్నారు.
కారు విక్రయిస్తామంటూ ఓ వ్యక్తి నుంచి రూ. 1.85 లక్షలు వసూలు చేశారు. డబ్బు తీసుకుని కారు ఇవ్వకుండా వ్యక్తిని మోసం చేశారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. రాచకొండ సైబర్క్రైం పోలీసులు ముఠా సభ్యులను పట్టుకున్నారు. నిందితుల వద్ద 4 సెల్ఫోన్లు, ల్యాప్ట్యాప్ను స్వాధీనం చేసుకున్నారు.