హైదరాబాద్ : కొవిడ్-19 మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి నిబంధనలను ప్రజలు కచ్చితంగా పాటించాలని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. శనివారం నాచారంలోని మల్లాపూర్ వద్ద రాచకొండ పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడం తప్పనిసరి చేసిందన్నారు.
సమూహానికి దూరం ఉండటం, తరుచుగా చేతులను శానిటైజ్ చేసుకోవడం, కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వైరస్ను నిలువరించాల్సిందిగా కోరారు. మాస్కులు ధరించనివారు రూ. వెయ్యి జరిమానాతో పాటు విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.