ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు ప్రేక్షకులని అలరించిన రాశీ ఖన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం గోపిచంద్ సరసన పక్కా కమర్షియల్ అనే సినిమా చేస్తుంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ బ్యానర్ల పై ఈ సినిమా తెరకెక్కుతుంది. సక్సెస్ ఫుల్ నిర్మాత బన్నీవాసు, స్టార్ డైరెక్టర్ మారుతి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
గోపీచంద్ – మారుతి కాంబినేషన్ లో సినిమా వస్తుందని అనౌన్స్ మెంట్ వచ్చినప్పటి నుంచే పక్కా కమర్షీయల్ టీజర్, ట్రైలర్ల పై అటు సాధారణ ప్రేక్షకులతో పాటు ఇటు ఇండస్ట్రీ ట్రేడ్ సర్కిల్స్లో ఉత్కంఠ ఏర్పడింది. పక్కా కమర్షీయల్ ఫస్ట్ లుక్ తో పాటు చిత్ర బృందం విడుదల చేసిన తదితర పబ్లిసిటీ మెటీరియల్స్ కి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా రాశీ ఖన్నా బర్త్ డే సందర్భంగా ఇంట్రెస్టింగ్ టీజర్ విడుదల చేశారు.
మారుతీ తన లాస్ట్ సినిమా “ప్రతి రోజు పండగే”లో రాశిని ఏంజెల్ ఆర్ణా అంటూ చిన్న కామికల్ గా చూపించారు. కానీ ఈసారి మాత్రం నిజమైన ఏంజెల్ లా చూపించారు. తన బర్త్ డే స్పెషల్ గా రివీల్ చేసిన ఈ వీడియో చాలా బాగుంది. ఇది సినిమాపై భారీ అంచనాలు పెంచుతుంది. పక్కా కమర్షియల్ అత్యంత ప్రతి ష్టాత్మకంగా రూపొందుతోంది. ఈ చిత్రానికి జేక్స్ బిజాయ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.