చేవెళ్లటౌన్, ఏప్రిల్ 6: ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి అన్నారు. బుధవారం చేవెళ్ల, అల్లవాడ, దామరిగిద్ద, రామన్నగూడ, సింగప్పగూడ, న్యాలట ప్రభుత్వ పాఠశాలలను చేవెళ్ల ప్రభుత్వ పాఠశాల 1981-82 10వ తరగతి పూర్వ విద్యార్థులతో కలిసి ఎంపీపీ సందర్శించారు.
ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. చేవెళ్ల జడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చెందిన 1981-82 10వ తరగతి పూర్వ విద్యార్థులు చేవెళ్లలోని ప్రభుత్వ పాఠశాలలకు రూ.15 లక్షలతో ప్రహరీ, పెయింటింగ్, వేదిక, రామన్నగూడ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు రూ.3.50 లక్షలతో పెయింటింగ్, బెంచీలు, దారమరిగిద్ద గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు రూ.3లక్షలతో పెయింటింగ్, ప్రహరీ, అల్లావాడ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు రూ.4 లక్షలతో ప్రహరీ, సింగప్ప గూడ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు రూ.4. 50 లక్షలతో పెయింటింగ్, ప్రహరీ, న్యాలట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు పెయింటింగ్ వేయించారని తెలిపారు. మరిన్ని సదుపాయాల కోసం తమ వంతు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి అక్బర్, రామన్నగూడ సర్పంచ్ లావణ్య, దామరిగి గిద్ద సర్పంచ్ వెంకటేశం గుప్తా, సింగప్పడ గూడ సర్పంచ్ రహీమా బేగం, చేవెళ్ల ప్రభుత్వ పాఠశాల పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.