న్యూఢిల్లీ : ప్రపంచంలో అతిపెద్ద అకౌంటింగ్ సంస్ధల్లో ఒకటైన పీడబ్ల్యూసీ ఇండియా తన 15,000 మంది ఉద్యోగులకు గురువారం ప్రత్యేక బోనస్ను ప్రకటించింది. రెండు వారాల వేతనంతో సమానమైన మొత్తాన్ని ఉద్యోగులకు బోనస్గా చెల్లించనుంది. మార్చి వేతనంతో పాటు ప్రత్యేక బోనస్ను చెల్లిస్తామని పీడబ్ల్యూసీ పేర్కొంది. గత ఏడాది కొవిడ్ మహమ్మారితో తమ ప్రయాణం సంక్లిష్టంగా సాగినా ఉద్యోగుల సహకారంతో క్లయింట్లకు మెరుగైన సేవలు అందించడమే కాకుండా పటిష్టంగా ముందుకొచ్చామని ఇందుకు ప్రశంసాపూర్వకంగా ఉద్యోగులందరికీ బోనస్ను ప్రకటిస్తున్నామని పీడబ్ల్యూసీ ఇండియా చీఫ్ సంజీవ్ కృష్ణన్ పేర్కొన్నారు.
ఇక ఈ నెల ఆరంభంలో వేతన పెంపుతో పాటు ప్రత్యేక బోనస్, ఇంక్రిమెంట్లను డెలాయిట్ ఇండియా ప్రకటించిన సంగతి తెలిసిందే. కొవిడ్-19 సృష్టించిన విధ్వంసం నుంచి ఆర్థిక వ్యవస్ధ తేరుకోవడంతో అడ్వైజరీ సేవలకు పెరిగిన డిమాండ్కు వేతన పెంపు, బోనస్ల ప్రకటన సంకేతమని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు.