బాలి: ఒక్క అంత్జాతీయ టైటిల్ గెలుపు లేకుండానే భారత స్టార్ షట్లర్ సింధు ఈ ఏడాది సీజన్ను ముగించింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్లో ఫైనల్ చేరిన సింధు విజయం సాధిస్తుందని అభిమానులు ఆశించారు. ఇండోనేషియా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ ఫైనల్లో సింధు పరాజయం పాలైంది.
దక్షిణ కొరియాకు చెందిన 19 ఏళ్ల షట్లర్ చేతిలో సింధు ఓటమి చవిచూసింది. ఆన్ సెయాంగ్తో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్స్లో 16-21, 12-21తో వరుస సెట్లు కోల్పోయిన సింధు ఓడిపోయింది. 39 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో ఓడిన సింధు సిల్వర్ మెడల్తో టోర్నీ ముగించింది. సెయాంగ్ చేతిలో ఓడిపోవడం సింధుకు ఇది వరుసగా మూడోసారి.
ఇప్పటి వరకూ వీళ్లిద్దరూ మూడుసార్లు తలపడగా, మూడుసార్లూ సెయాంగ్ విజయం సాధించింది. మళ్లీ సింధును కోర్టులో చూడాలంటే స్పెయిన్లో జరిగే వరల్డ్ ఛాంపియన్షిప్స్ టోర్నీ వరకూ ఆగాల్సిందే. ఈ టోర్నీలో సింధు డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగనుంది.