ఆల్ ఇంగ్లండ్ సెమీస్లో సింధు ఓటమి
బర్మింగ్హామ్: ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్షిప్లో భారత స్టార్ షట్లర్ వీపీ సింధు పోరాటం ముగిసింది. శనివారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్లో ప్రపంచ చాంపియన్ సింధు 17-21, 9-21 తేడాతో ఆరో సీడ్ పార్న్పావీ చోచువాంగ్ (థాయ్లాండ్) చేతిలో 43 నిమిషాల్లోనే పరాజయం పాలైంది. శుక్రవారం క్వార్టర్స్లో అద్భుత పోరాటంతో మూడో సీడ్ యమగూచిని 16-21, 21-16, 21-19తో ఓడించిన ప్రపంచ ఏడో ర్యాంకర్ సింధు సెమీస్లో తడబడింది. 2018లోనూ ఈ టోర్నీ సెమీస్లోనే ఆమెకు చుక్కెదురైంది. కాగా ప్రకాశ్ పదుకొనె, గోపీచంద్ తర్వాత భారత్ తరఫున ఎవరూ ఆల్ ఇంగ్లండ్ టైటిల్ సాధించలేకపోయారు.