ముషీరాబాద్: పలు సంస్కరణలు తీసుకువచ్చి కష్టాల్లో ఉన్న దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దిన ఘనత మాజీ ప్రధానీ పీవీ.నరసింహారావుకే దక్కిందని దేవాదాయ శాఖ మంత్రి ఐ ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. దేశం ఎంతగానో అభివృద్ది చెందడానికి పీవీ బాటలు వేశారని అన్నారు. బుధవారం చిక్కడపల్లి త్యాగరాయగానసభలో సర్వార్థ సంక్షేమ సమితి 29 వ వార్షికోవ వేడుకలు, పీవీ శతజయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పలువురు వేద పండితులను ఘనంగా సత్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ నిర్మల్ జిల్లాలో త్వరలో పీవీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని అర్చకులు, వేద పండితులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తున్నామని, దూపదీప నైవేద్యాలకు ఆరువేలు ఇస్తున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మికవేత్త పీవీ మనోహర్రావు రచించిన సమర్పణం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ విద్యాశంకర భారతీ స్వామి, ఎమ్మెల్సీ వాణిదేవి, పీవీ ప్రభాకర్రావు, గంగాధర శాస్త్రి, వెంకటరమణ శర్మ, సీనియర్ సంపాదకులు రామచంద్రమూర్తి, మదన్మోహన్రావు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.