తిరుమల : తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో సోమవారం కొవిడ్ నిబంధనల మేరకు ఏకాంతంగా పుష్పయాగం నిర్వహించనున్నారు. కార్యక్రమం కోసం నేడు (ఆదివారం) సాయంత్రం 6.30గంటల నుంచి రాత్రి 8.30 వరకు పుష్పయగానికి అంకురార్పణ జరుగనుంది. సోమవారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు స్వామి, అమ్మవారి ఉత్సవరులకు స్వపనతిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీతాలక్ష్మణ సమేత కోదండ రామస్వామికి పలు రకాల పుష్పాలతో అభిషేకం చేయనున్నారు.
అనంతరం సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారిని ఆలయంలోనే ఊరేగిస్తారు. ఆలయంలో మార్చి 13 నుంచి 21వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం విదితమే. ఈ బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు.
ఇవి కూడా చదవండి..