అల వైకుంఠపురములో చిత్రం తర్వాత బన్నీ నటిస్తున్న చిత్రం పుష్ప. ఆర్య, ఆర్య2 చిత్రాల తర్వాత సుకుమార్ తో కలిసి పుష్ప చిత్రం చేస్తున్నాడు అల్లు అర్జున్. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీలో హీరోయిన్ రష్మిక మందన్నా. రెండు భాగాలుగా విడుదల కాబోతున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 17న విడుదలకు సిద్దమవుతోన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే పుష్ప నుంచి విడుదల ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగ్ల్తో పాటు ఫస్ట్లుక్, టీజర్, ట్రైలర్ విశేష స్పందన వచ్చింది.
తాజాగా చిత్రం నుండి మూడో సాంగ్ విడుదల చేశారు. ‘నువ్వు అమ్మి అమ్మి అంటుంటే… నీ పెళ్లాన్నే అయిపోయినట్టుంది రా సామీ’ అంటూ సాగే ఈ మూడో పాట శ్రోతలని ఎంతగానో ఆకట్టుకుంటుంది. విజువల్స్ చాలా ఆకట్టుకునేలా ఉన్నాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలో విడుదలైన ఈ సాంగ్కి కూడా మంచి ఆదరణ లభిస్తుంది. కాగా ఇప్పటికే విడదులైన ఫస్ట్ సింగిల్ దాక్కో దాక్కో మేక, శ్రీవల్లిగా రష్మికపై చిత్రీకరించిన ‘చూపే బంగారమయ్యేనే శ్రీ వల్లి.. మాటే మాణిక్యమాయేనే’ పాటకు సంగీత ప్రియుల నుంచి విశేష స్పందన లభించింది.