హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మార్క్ఫెడ్ను ఆర్థికంగా గాడిలో పెట్టేందుకు అధికారులు మార్గాలు అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగానే వివిధ వ్యాపారాల నిర్వహణపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. విజయవంతంగా కొనసాగుతున్న పంజాబ్, హర్యానా రాష్ర్టాల మార్క్ఫెడ్లపై అధ్యయనం కోసం రాష్ట్ర అధికారుల బృందం బుధవారం తొలిరోజు పంజాబ్ మార్క్ఫెడ్ నిర్వహిస్తున్న పలు వ్యాపారాలను పరిశీలించింది.
అక్కడి అధికారులను కలుసుకొని వారు అమలుచేస్తున్న విధానాలపై చర్చించారు. గురువారం ఈ బృందం హర్యానాలో పర్యటించనున్నది. రాష్ట్ర అధికారుల బృందంలో మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, ఎండీ యాదిరెడ్డి, జీఎం విష్ణువర్ధన్, మార్కెటింగ్ మేనేజర్ చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.