న్యూఢిల్లీ: కేఎల్ రాహుల్ ఫ్రాంచైజీని వీడడం నిరాశకు గురి చేసిందని పంజాబ్ కింగ్స్ సహ యజమాని నెస్ వాడియా అన్నాడు. కొత్తగా రానున్న జట్టును రాహుల్ ముందే సంప్రదించి ఉంటే అది అనైతికమని పేర్కొన్నాడు. ఐపీఎల్ రిటెన్షన్ ప్రక్రియలో పంజాబ్ కింగ్స్.. మయాంక్ అగర్వాల్, అర్ష్దీప్ సింగ్ను మాత్రమే అట్టిపెట్టుకుంది. రాహుల్ను తీసుకోకపోవడంపై వాడియా స్పందిస్తూ.. ‘మేం రిటైన్ చేసుకోవాలనుకున్నా రాహుల్ వేలానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అతడు ముందే మరో ఫ్రాంచైజీని సంప్రదించి ఉంటే అది అనైతికం. అలా చేసి ఉండకపోవచ్చు. ఒకవేళ అలా చేస్తే బీసీసీఐ నిబంధనలకు విరుద్ధం. మయాంక్, అర్ష్దీప్ను అట్టిపెట్టుకోవడం సంతోషంగా ఉంది. వీరిద్దరూ అసాధారణ ఆటగాళ్లు. త్వరలో అర్ష్దీప్ భారత జట్టులో ఆడుతాడు’ అని వాడియా తెలిపాడు. పర్స్లో ఇంకా రూ.72 కోట్లు మిగుల్చుకున్న పంజాబ్ మెగా వేలంలో వికెట్లవీరుడు రవిచంద్రన్ అశ్విన్ను తీసుకోవాలని భావిస్తున్నది.