చండీగఢ్: పంజాబ్ సీఎం భగవంత్ మాన్పై మరో ఆరోపణ తెరపైకి వచ్చింది. ఆయనకు 42 కార్ల కాన్వాయ్ ఉందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఎన్నికల ముందు చెప్పిన దానికి, ప్రస్తుతం ఆయన వ్యవహరిస్తున్న తీరు చాలా భిన్నంగా ఉన్నదని ఆరోపించాయి. భగవంత్ మాన్ ‘వీఐపీ సంస్కృతి’ని అనుసరిస్తున్నారని విమర్శించాయి. కాంగ్రెస్ నేత, పంజాబ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడైన పర్తాప్ సింగ్ బజ్వా ఆ రాష్ట్ర రవాణా కమిషనర్ ఇచ్చిన ఆర్టీఐ నివేదికను బయటపెట్టారు. సీఎం భగవంత్ మాన్కు 42 వాహనాల కాన్వాయ్ ఉన్నట్లు అందులో ఉంది.
కాగా, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రులు ప్రకాష్ సింగ్ బాదల్, అమరీందర్ సింగ్, చరణ్జిత్ సింగ్ చన్నీల కంటే కూడా ఆప్ సీఎం భగవంత్ కాన్వాయ్లో వాహనాల సంఖ్య ఎక్కువ అని కాంగ్రెస్ నేత బజ్వా ట్విట్టర్లో విమర్శించారు. భగవంత్ మాన్ ఎంపీగా ఉన్నప్పుడు ఇలాంటి అంశాలపై అధికార పార్టీలను విమర్శించిన సంగతిని ఆయన గుర్తు చేశారు. మరోవైపు ఈ ఆరోపణపై సీఎం భగవంత్ మాన్ ఇంకా స్పందించలేదు.
Shocking revelation-
CM Badal had 33 vehicles when he was CM from 2007-17 in his cavalcade & there was no change in number of vehicles when Captain Amarinder S became the CM but it has been revealed through RTI that CM Mann “The so called Aam Aadmi” has 42 cars in his cavalcade. pic.twitter.com/lEFt6Ve3xm
— Partap Singh Bajwa (@Partap_Sbajwa) September 28, 2022