చట్టం తీసుకురానున్న చైనా
బీజింగ్, అక్టోబర్ 20: పిల్లలు తప్పు చేస్తే వారి తల్లిదండ్రులను శిక్షించడానికి చైనా సిద్ధమైంది. ఇందుకోసం చట్టాన్ని తీసుకురానున్నది. ఇప్పటికే ముసాయిదా బిల్లును కూడా సిద్ధం చేసింది. ఇది చట్టం అయితే 16 ఏండ్ల లోపు పిల్లలు నేరాలు చేస్తే వారి తల్లిందండ్రులకు శిక్షలు విధిస్తారు. పిల్లలు విశ్రాంతి తీసుకోవడానికి, ఆడుకోవడానికి, వ్యాయామానికి కూడా తల్లిదండ్రులు తగిన సమయం ఇవ్వాలని ఈ చట్టం సూచిస్తుంది.