న్యూఢిల్లీ: భారత టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా తన శైలికి భిన్నంగా రెచ్చిపోతున్నాడు. సాధారణంగా నిధానంగా ఆడే పుజ్జీ.. రాయల్ లండన్ వన్డే కప్లో బౌలర్లకు చుక్కలు చూపుతున్నాడు. ఇటీవలే వార్విక్షైర్పై మెరుపు శతకంతో ఆకట్టుకున్న పుజారా.. వరుసగా రెండో మ్యాచ్లో సెంచరీతో మెరిశాడు.
ఆదివారం సర్రేతో జరిగిన పోరులో ససెక్స్ కెప్టెన్గా బరిలోకి దిగిన పుజారా (131 బంతుల్లో 174; 20 ఫోర్లు, 5 సిక్సర్లు) భారీ శతకంతో ఆకట్టుకున్నాడు. లిస్ట్ ‘ఎ’ క్రికెట్లో చతేశ్వర్ పుజారాకు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.