పుదుచ్చేరి : కరోనా లాక్డౌన్ను పుదుచ్చేరి ప్రభుత్వం ఈ నెల 14 వరకు పొడగించింది. ఇంతకు ముందు సడలింపులతో ఈ నెల 7వ తేదీ వరకు పొడగించారు. సోమవారం రాత్రితో గడువు ముగియగా.. మరోవారం పొడగిస్తూ ఆదేశాలిచ్చారు. మంగళవారం నుంచి మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దుకాణాలు నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించారు. కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే 12వ తరగతి బోర్డు పరీక్షలు రద్దు చేశారు. సోమవారం కేంద్ర పాలిత ప్రాంతంలో 482 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పుదుచ్చేరిలో ప్రస్తుతం 8,270 క్రియాశీల కేసులు ఉండగా.. మొత్తం 1,628 మంది వైరస్ బారినపడి మృతి చెందారు. లక్షలకుపైగా కొవిడ్ కేసులు నమోదవగా.. 99,181 మంది కోలుకున్నారు.