ఇందూరు, బీర్కూర్, ఆగస్టు 25 : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై నిరాధార ఆరోపణలు, ఇంటిపై జరిగిన దాడిపై టీఎన్జీవోస్ నాయకులు , ఉమ్మడి నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు హైదరాబాద్లో ఎమ్మెల్సీ కవితను ఆమె నివాసంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిసి సంఘీభావం ప్రకటించారు.
సంఘీభావం తెలిపిన వారిలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్ , కార్యదర్శి సంఘం అమృత్కుమార్, కార్యవర్గ సభ్యులు చిట్టి నారాయణరెడ్డి ఉన్నారు. అనంతరం వివిధ శాఖల జిల్లా ఉద్యోగుల సమస్యలపై చర్చించగా సానుకూలంగా స్పందించి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ హామీ ఇచ్చారని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు తెలిపారు. ఎమ్మెల్సీ కవితను మంత్రులు మహమూద్ అలీ, వేముల ప్రశాంత్రెడ్డి కలిసి సంఘీభావం తెలిపారు. కవితపై నిరాధార ఆరోపణలు చేయడం తగదని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.