పెద్దపల్లి, జూలై 18(నమస్తే తెలంగాణ) : పక్షుల కిల కిలా రావాలు.. పచ్చని సెలయేళ్ల నడుమ పెద్దపల్లి జిల్లా కేంద్రానికి అతి సమీపంలోని సబ్బితం గౌరీ గుండాల జలపాతం పర్యాటకులకు ఆహ్లాదం పంచుతున్నది.
40 అడుగుల ఎత్తు గుట్ట పై నుంచి కిందికి దూకుతూ మంత్ర ముగ్ధుల్ని చేస్తున్నది. నురుగలు కకుతూ పాలధారల్లా జాలువారుతున్న నీటిని చూసి పర్యాటకులు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఉమ్మడి కరీంనగర్, మంచిర్యాల జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.