నాగర్ కర్నూల్ : నల్లమల ఆదివాసీల కోసం ఈ నెల 4న ప్రత్యేకంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎల్బీ లక్ష్మీకాంత్ రాథోడ్ తెలిపారు. గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఆదేశాల మేరకు లింగాల మండలం బౌరాపూర్లో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. బౌరాపూర్, అప్పాపూర్ గ్రామాలతో పాటు పరిసర నల్లమల చెంచుపెంటల్లో నివాసం ఉంటున్న ఆదివాసీలకు ఉచిత సేవలు అందించనున్నట్లు చెప్పారు. కార్యక్రమం ప్రారంభోత్సవానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కలెక్టర్ శర్మన్తో పాటు ఆదివాసీల పరిశోధకురాలు ప్రొఫెసర్ గూడూరు మనోజ, జిల్లా వైద్యాధికారి సుధాకర్ లాల్, మహబూబ్నగర్ హెల్త్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ కిషన్ పాల్గొంటారని పేర్కొన్నారు.