అమరావతి,జూన్ 29:ఇద్దరు చిన్నారులను అతికిరాతకంగా హత్య చేశాడు ఓ సైకో.. అభం శుభం తెలియని చిన్నారులను వరసకు బాబాయి అయిన కాటూరి శ్రీనివాసరావు అనే సైకో కర్రతో ఇంట్లో తలుపులు వేసి అతిదారుణంగా హత్య చేశాడు.ఈ సంఘటన సోమవారం రేపల్లెలో సంచలనం కలిగించింది.
“రేపల్లెలోని నేతాజీ నగర్ లో నివాసం ఉంటున్న అమ్మమ్మ వద్దకు చేబ్రోలు మండలం వేజండ్ల గ్రామానికి చెందిన కొండేటి కోటేశ్వరరావు ఉమాదేవి దంపతుల ఇద్దరు కుమారులు10ఏండ్ల పార్థివ్ సాహసవత్, 8ఏండ్ల రోహిత్ తశ్విన్, అనే ఇద్దరు పిల్లలను ఉమాదేవి చెల్లెలి భర్త అయిన కాటూరి శ్రీనివాసరావు అతి దారుణంగా హత్య చేశాడు. కొండేటి కోటేశ్వరరావు ఉమాదేవి బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నది. లాక్ డౌన్ కారణంగా పిల్లలు రేపల్లెలోని అమ్మమ్మ మోర్ల విజయలక్ష్మి వద్ద ఉంటున్నారు. హత్య చేసిన వ్యక్తి కర్లపాలెం గ్రామానికి చెందిన కాటూరి శ్రీనివాసరావు తనంతట తానే పోలీసులు ఎదుట లొంగిపోయాడు. నిందితుడు చాలాకాలంగా మానసికపరిస్థితి సరిగా ఉండడంలేదు.