చూస్తుంటే.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇదే చేసేలా కనిపిస్తున్నాడు. చెప్పింది ఒక్కటి కూడా చేయడం లేదు పవర్ స్టార్. అందుకే అభిమానులు కూడా బాగా ఫీల్ అవుతున్నారు. ఈయన సినిమాల గురించి తెలుసుకోడానికి అభిమానులు ఎంతలా ఎదురు చూస్తుంటారనేది చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ సినిమా అప్ డేట్ పండగ చేసుకుంటారు ఫ్యాన్స్. అలాంటిది ఆయన సినిమా ఫస్ట్ లుక్ కానీ.. టీజర్ కానీ వచ్చిందంటే రచ్చ రచ్చే. ఇప్పుడు ఇదే జరగబోతుంది. ఈయన ప్రస్తుతం అరడజన్ సినిమాలు చేస్తున్నాడు. అందులో ఏది ఎప్పుడు వస్తుందో ఎవరికీ క్లారిటీ లేదు. ఇప్పటికే వకీల్ సాబ్ పనులన్నీ పూర్తి చేసుకుని ఎప్రిల్ 9న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఆ తర్వాత క్రిష్ సినిమా కూడా అదే క్రమంలో వచ్చేస్తుంది. ఎన్టీఆర్ బయోపిక్ డిజాస్టర్ అయిన తర్వాత అంతకంటే భారీ అవకాశం దక్కించుకున్నాడు క్రిష్ జాగర్లమూడి.
పవన్ కళ్యాణ్ తో ఇప్పుడు చిన్న సైజ్ బాహుబలి చేస్తున్నాడు క్రిష్. ఈ సినిమా కోసం 100 కోట్లకు పైగానే ఖర్చు చేస్తున్నాడు నిర్మాత ఏఎం రత్నం. 200 ఏళ్ళ కింద స్టోరీతో ఈ సినిమా రాబోతుంది. తొలిసారి తన కెరీర్ లో చారిత్రాత్మక కథతో వస్తున్నాడు పవర్ స్టార్. ఈ చిత్రం కోసం ‘హరహర వీరమల్లు’ అనే టైటిల్ రిజిస్టర్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఇందులో పవన్ కళ్యాణ్ వజ్రాల దొంగగా కనిపించనున్నాడని.. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఔరంగజేబు పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తుంది. నిధి అగర్వాల్ హీరోయిన్. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ మహా శివరాత్రి కానుకగా మార్చ్ 11న విడుదల చేస్తారని ఈ మధ్యే వార్తలొచ్చాయి.
దీనిపై సోషల్ మీడియాలో ప్రచారం కూడా జరిగింది. అయితే ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం అలాంటిదేం లేదని తెలుస్తుంది. మార్చ్ 11 కాకుండా మరో డేట్ పవన్ నిర్మాతలు ఎంపిక చేసుకున్నాడని.. ఆ రోజే క్రిష్ సినిమాకు సంబంధించిన అప్ డేట్ బయటికి వస్తుందని వార్తలొస్తున్నాయి. దాంతో పవన్ ఫ్యాన్స్ నిరాశలో మునిగిపోతున్నారు. కొత్త తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు దర్శక నిర్మాతలు. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో జరుగుతుంది. దీనికోసం భారీ ఎత్తున చార్మినార్ సెట్ వేసారు. అక్కడే ఈ సినిమాకు సంబంధించి కీలకమైన పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు క్రిష్. మొత్తానికి ఆ కొత్త డేట్ ఎప్పుడనేది ఆసక్తిగా చూస్తున్నారు.