పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్లో సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. వకీల్ సాబ్ అనే చిత్రంతో త్వరలో ప్రేక్షకులని పలకరించనున్న పవన్ ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో పీరియాడికల్ చిత్రం, సాగర్ కె చంద్ర దర్శకత్వంలో అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ చేస్తున్నాడు. వీటి తర్వాత హరీష్శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు.
క్రిష్ మూవీ విషయానికి వస్తే 200 ఏళ్ళ కిందట జరిగిన కథతో ఈ మూవీ రూపొందుతుంది. హరిహర వీరమల్లు అనే టైటిల్ని చిత్రానికి ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఇందులో పవన్ కళ్యాణ్ వజ్రాల దొంగగా కనిపించనున్నాడని, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఔరంగజేబు పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తుంది. ఈ మూవీ అప్డేట్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, మార్చి 11 శివరాత్రి సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్తో పాటు టైటిల్ రివీల్ చేయనున్నారట. ఆ రోజు కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.