అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాలు కల్పించడంలో విఫలమయ్యారంటూ ఇవాళ అసెంబ్లీ ప్రారంభం సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాలినడకన నిరసన ర్యాలీ చేపట్టారు. వెంకటపాలెంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, టీడీపీ ఏపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్స్టేషన్ వద్ద టీడీపీ శాసనసభ పక్షం ఆధ్వర్యంలో జాబ్ క్యాలెండర్పై నిరసన తెలిపారు. అక్కడి నుంచి కాలినడకన అసెంబ్లీకి చేరుకున్నారు.
‘ జాబ్ రావాలంటే..జగన్ పోవాలంటూ’ ‘జాబ్ ఎక్కడా..జగన్ ఎక్కడ’ అంటూ నినాదాలు చేశారు. ఉద్యోగాలు లేక ఏపీలో యువత నిర్వీర్యమవుతుందనిఈ అంశంపై సభలో చర్చించాలని డిమాండ్ చేశారు. కాగా మరో వైపు తెలుగుయువత, టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి యత్నించిన టీడీపీ నాయకులు శ్రీరాం చినబాబుతో సహ ఇతర నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, తెలుగు యువత నాయకుల మధ్య తోపులాట జరిగింది. అనంతరం వారిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్కు తరలించారు.