ఢిల్లీ, జూన్ 13: కరోనా రెండో దశలో, దేశవ్యాప్తంగా వైద్య ఆక్సిజన్ అవసరం పెరిగింది. భవిష్యత్తులో తగినంత ఆక్సిజన్ ఉండేలా చూసుకోవడానికి, ప్రస్తుత డిమాండ్కు తగ్గట్లుగా ఆక్సిజన్ను ఉత్పత్తి చేయడం తప్పనిసరిగా మారింది. వైద్య ఆక్సిజన్ డిమాండ్లో పెరుగుదలకు తగ్గట్లుగా దేశంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి, కేంద్రం “భారత్ కోసం ప్రాజెక్ట్ ఓ2” పిలుపునిచ్చింది. భారత్ కోసం ప్రాజెక్ట్ ఓ2 కింద జియోలైట్స్ వంటి ముఖ్యమైన ముడి పదార్థాల జాతీయ స్థాయి సరఫరా, చిన్న ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు, కంప్రెషర్ల తయారీ, ఆక్సిజన్ ప్లాంట్లు, కాన్సన్ట్రేటర్లు, వెంటిలేటర్ల వంటి తుది ఉత్పత్తులను నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఆక్సిజన్ అనుమతిస్తుంది.
ఆక్సిజన్ స్వల్పకాలిక డిమాండ్ను తీర్చడమేగాక, దీర్ఘకాలిక అవసరాలకు తగ్గట్లుగా ఉత్పత్తి వ్యవస్థను బలోపేతం చేయడంపైనా కన్సార్టియం దృష్టి పెడుతుంది. భారతదేశ ఉత్పత్తిదారులు, స్టార్టప్లు, ఎంఎస్ఎంఈల (ఫిక్కీ, ఎంఈఎస్ఏ వంటి వాటి భాగస్వామ్యంతో కూడినవి) నుంచి వచ్చే ఆక్సిజన్ ప్లాంట్లు, కాన్సన్ట్రేటర్లు, వెంటిలేటర్ల వంటి అత్యవసర ఉపకరణాల ఉత్పత్తిని ఒక నిపుణుల కమిటీ పర్యవేక్షిస్తుంది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, టాటా కన్సల్టింగ్ ఇంజినీర్స్, బెంగళూరు సీ-క్యాంప్, కాన్పూర్ ఐఐటీ, దిల్లీ ఐఐటీ, బాంబే ఐఐటీ, హైదరాబాద్ ఐఐటీ, భోపాల్ ఐఐఎస్ఈఆర్, పుణె వెంచర్ సెంటర్ సహా 40కిపైగా ఎంఎస్ఎంఈలు ఉత్పత్తి, సరఫరా కన్సార్టియంలో ఉంటాయి.