నాగ చైతన్య,సాయి పల్లవి ప్రధాన పాత్రలలో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం లవ్ స్టోరీ. ఏప్రిల్లో విడుదల కావలసి న ఈ చిత్రం కరోనా వలన వాయిదా పడింది. కొద్ది రోజులుగా ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుందని, లేదంటే థియేటర్స్ తెరచుకున్నాక 50 శాతం ఆక్యుపెన్సీతో ప్రదర్శన జరుపుకుంటుందని జోరుగా ప్రచారం నడుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అనేక ప్రచారాలు నడిచిన నేపథ్యంలో స్పందించిన నిర్మాతలు తాజాగా మరోసారి వివరణ ఇచ్చారుజ
చిత్ర నిర్మాతలలో ఒకరైన సునీల్ నారంగ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ ఎత్తివేసిన తర్వాతే ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తామని తెలిపారు. థియేటర్లలో రోజుకు మూడు షోలకు మాత్రమే అనుమతి ఇస్తే మా సినిమాను రిలీజ్ చేయం. నైట్ కర్ఫ్యూ ఎత్తివేసిన తర్వాతే సినిమాను రిలీజ్ చేయనున్నాం. జూలైలో రెండో వారంలో పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని ఆశిస్తున్నాం. చిత్ర రిలీజ్ డేట్ త్వరలోనే అధికారికరంగా వెల్లడిస్తాం అంటూ సునీల్ పేర్కొన్నారు.