శ్రీరామ్ నిమ్మల, రిచా జోషి జంటగా నటిస్తున్న చిత్రం ‘మది’ నాగ ధనుష్ దర్శకుడు. రామ్కిషన్ నిర్మాత. నిర్మాణానంతర పనులు జరుపుకుంటోంది. నిర్మాత మాట్లాడుతూ ‘ఈతరం యువత ఆలోచనకు అద్దంపట్టే విధంగా ఉన్న సినిమా ఇది. వినూత్న రీతిలో కథనం ఆకట్టుకుంటుంది. ప్రతి ఒక్కరిలో మదిలో నిలిచిపోయే విధంగా చిత్రాన్ని తీర్చిదిద్దాం. వైజాగ్, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం. త్వరలోనే విడుదల తేదిని ప్రకటిస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: పీవీఆర్ రాజా. సమర్పణ: ఆర్వీ రెడ్డి.