తమిళ స్టార్ హీరో సూర్య కరోనా వలన తన సినిమాలను ఓటీటీలో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.ఆకాశం నీ హద్దురా (సురారై పొట్రు) ఓటీటీలో విడుదలై గొప్ప ఆదరణతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. సుధా కొంగర తెరకెక్కించిన ఈ చిత్రం ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ జిఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా రూపొందింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో డైరెక్ట్ గా విడుదలైంది. ఇప్పటికీ చక్కని ఆదరణ దక్కించుకుంటోంది.
హిందీలో ఈ చిత్రాన్ని అబుండంటియా ఎంటర్ టైన్ మెంట్ తో పాటు సూర్య నిర్మిస్తున్నారు. తమిళంలో సూర్య పోషించిన పాత్రని హిందీలో ఎవరు చేస్తారనే దానిపై సస్పెన్స్ నెలకొని ఉంది. అయితే శిఖ్యా సంస్థతో 2డి ఎంటర్ టైన్ మెంట్స్ ఒప్పందం కుదుర్చుకోగా, ఇప్పుడు దానిని బ్రేక్ చేసినట్టు తెలుతుస్తుంది. ఈ క్రమంలో సూర్య కి చెందిన 2D ఎంటర్ టైన్ మెంట్ పై మద్రాస్ హైకోర్టులో ఒక కేసు దాఖలైంది.
శిఖ్యా సంస్థ సమ్మతి లేకుండా అబుండంటియాతో సూర్య చేతులు కలిపారు. అది ఒప్పందాన్ని మీరడమేనని శిఖ్యా కోర్టులో ఫిర్యాదు చేసింది. రీమేక్కి సంబంధించి సన్నాహాలు శరవేగంగా జరుగుతుండగా, కోర్టు నిలుపుదల ఉత్తర్వును ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. కాగా సూర్య నటించిన జై భీమ్ కూడా ఓటీటీలో విడుదల కానున్న విషయం తెలిసిందే.