న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వంలో ఒక్కొక్కరుగా కరోనా బారినపడుతున్నారు. గురువారం పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి పాజిటివ్ రాగా, నేడు ఆమె కూతురు, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రాకు (Priyanka Gandhi) వైరస్ సోకింది. దీంతో ఆమె స్వీయ నిర్బంధంలో ఉన్నారు. ‘నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. స్వల్ప లక్షణాలు ఉన్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తున్నాను. ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నాను. గత కొన్నిరోజులుగా తనను కలిసిన వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను’ అని ట్వీట్ చేశారు.
I've tested positive for COVID-19 with mild symptoms. Following all the protocols, I have quarantined myself at home.
I would request those who came in contact with me to take all necessary precautions.
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) June 3, 2022
నేషనల్ హెరాల్డ్ కేసులో ఈ నెల 8న ఈడీ ముందు హాజరవాల్సి ఉండగా.. గురువారం సోనియా గాంధీకి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమె విచారణకు హాజరవుతారా లేదా అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ కూడా కరోనా పాజిటివ్గా నిర్ణారణ అయిన విషయం విధితమే.
కాగా, ఇదే కేసులో విచారణ ఎదుర్కోవాల్సిందిగా పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీకి కూడా ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసింది. అయితే తాను విదేశీ పర్యటనలో ఉన్నానని, విచారణ తేదీని మార్చాలని ఆయన కోరారు. దీంతో తాజాగా ఈడీ మరోసారి విచారణ తేదీని నిర్ణయించింది. ఈ నెల 13న హాజరవ్వాలని తాఖీదులు ఇచ్చింది.