తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో నటించి అశేష ప్రేక్షకాదరణ పొందిన నటి ప్రియమణి. పరుథివీరన్ మూవీకి గానూ ఉత్తమ నటిగా జాతీయ అవార్డు సొంతం చేసుకున్న ప్రియమణి పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించింది. అడపాదడపా సపోర్టింగ్ క్యారెక్టర్స్ పోషిస్తూ అలరిస్తుంది. అలానే టీవీ షోలకు జడ్జిగాను,వెబ్ సిరీస్లతోను బిజీగా ఉంటుంది.
ప్రియమణి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. అడపాదడపా హాట్ హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ను థ్రిల్ చేస్తుంది. రీసెంట్గా బ్యాక్ డ్రెస్లో దిగిన కొన్ని హాట్ ఫొటోస్ షేర్ చేసింది. దీనికి ఓ నెటిజన్ మీ న్యూడ్ ఫొటో ఒకటి షేర్ చేయమని అడిగాడు. దీనికి బదులిచ్చిన ప్రియమణి.. మీ అక్కది కాని ,అమ్మది కాని న్యూడ్ ఫొటో పెట్టు, ఆ తర్వాత నాది పెడతాను అని బదులిచ్చింది. దీనికి సదరు నెటిజన్ సారీ అని సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం ప్రియమణి కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. కాగా , ప్రియమణి ఇప్పుడు తెలుగులో విరాట పర్వం, నారప్ప, సిరివెన్నెల, సైనెడ్ సినిమాల్లో నటిస్తోంది. 2017లో ముస్తఫా రాజ్ను ప్రియమణి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.