ఈ వారం ఎలిమినేషన్లో నాగార్జున సరికొత్త ట్విస్ట్ ఇచ్చాడు. ఇద్దరు స్టేజ్పైకి వస్తారేమోనంటూ నాగార్జున అనడంతో అంతా షాక్ అయ్యారు. నామినేషన్ లో ఉన్న వారిని ఒక్కొక్కరిగా సేవ్ చేసుకుంటూ వచ్చిన నాగార్జున చివరకు మిగిలిన అనీ , ప్రియలని బయట ఉన్న బాక్సులలో నిలుచోమని చెప్పాడు .కాసేపటికి బాక్సు తెరిచి చూడొచ్చని నాగ్ చెప్పగా ఇంటిసభ్యులు ఎంతో ఆతృతగా వాటిని ఓపెన్ చేశారు.
రెండు బాక్సుల్లో ఇద్దరూ మాయం అవడంతో అందరూ ఖంగు తిన్నారు. ఇద్దరూ ఎలిమినేట్ అవుతారేమోనని నాగ్ అనడంతో మరింత ఆందోళన చెందారు. ప్రియ వెళ్లిపోతుందేమోనని గాబరా చెందిన పింకీ గుక్కపెట్టి ఏడ్చేయగా మానస్ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేఆడు.అందరు టెన్షన్లో ఉండగా, అనీ మాస్టర్ తిరిగి హౌజ్లోకి వచ్చింది. ప్రియ మాస్టర్ ఎలిమినేట్ అయినట్టు చెప్పుకొచ్చింది.
అనీ మాస్టర్ రావడంతో సన్నీ తెగ ఆనందించాడు.ఆమెను గట్టిగా హత్తుకుని ఎమోషనల్ అయ్యాడు. మరోవైపు ప్రియ వెళ్లిపోవడంతో ప్రియాంకతో పాటు మరి కొందరు కంటెస్టెంట్స్ చాలా బాధపడ్డారు.ఆమె వెళ్లిపోతుందని అస్సలు ఊహించలదేని అన్నారు.అయితే స్టేజీ మీదకు వచ్చిన ప్రియ బిగ్బాస్ ద్వారా ప్రపంచంలో ఏ మూలనైనా బతికేయడం నేర్చుకున్నానంది.