అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల (Kanchikacherla) వద్ద ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రవేట్ బస్సు కంచికచర్ల వద్ద హైవేపై ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.