హైదరాబాద్ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ హైవేపై ప్రైవేటు బస్సు ప్రమాదశాత్తు బోల్తాపడింది. ఘటనలో ఐదుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను రిమ్స్కు తరలించారు. బస్సు నాగ్పూర్ నుంచి హైదరాబాద్కు వస్తుండగా ఘటన చోటు చేసుకున్నది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 20 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులకు ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.