న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును వదలడం లేదు. ఇప్పటికే టీమ్లో ఆరుగురికి పాజిటివ్ తేలగా.. తాజాగా హెడ్ కోచ్ రికీ పాంటింగ్ కుటుంబసభ్యుల్లో ఒకరికి కోవిడ్ సోకింది. దీంతో ఐదు రోజుల పాటు పాంటింగ్ ఐసొలేషన్లోకి వెళ్లాడు. అతడి కుటుంబాన్ని కూడా ఐసొలేషన్కు పంపించారు. రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్కు ముందు ఢిల్లీ జట్టులోని సభ్యులకు కొవిడ్-19 పరీక్షలు చేయగా అందరికీ నెగిటివ్ వచ్చిందని డీసీ యాజమాన్యం తెలిపింది.