మంచిర్యాల : పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపేట వేస్తున్నదని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు. చెన్నూర్ నియోజకవర్గంలో శనివారం పలు చోట్ల శంకుస్థాపనలు, ముస్లింలకు రంజాన్ కానుకలు అందజేశార. మందమర్రి మండలంలోని బొక్కలగుట్ట గ్రామస్తుల దశాబ్దాల కల అయిన నూతన బ్రిడ్జి, చెక్ డ్యామ్, బొక్కలగుట్ట గ్రామం వరకు ఆర్ అండ్ బీ రోడ్డు పనులను ప్రారంభించారు.
మందమర్రి మున్సిపాలిటీ ఆఫీస్ లో 24 స్వచ్ఛ ఆటోలను, నూతన ట్రాలీ, వాటర్ ట్యాంకర్ లను ప్రారంభించారు. అలాగే క్యాతనపల్లి మున్సిపల్ ఆఫీస్ లో 18 స్వచ్ఛ ఆటోలు, నూతన ట్రాక్టర్, ట్యాంకర్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అన్నారు. పేదల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం కేసీఆర్ నిరంతరం పాటుపడుతున్నారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
కరోనాతో కొడుకు.. తట్టుకోలేక తండ్రి మృతి
అంబులెన్స్లో ప్రసవం..తల్లి, బిడ్డ క్షేమం
దళారుల బెడద అరికట్టేందుకే కొనుగోలు కేంద్రాలు
తెలంగాణలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు
రాధాకృష్ణను పరామర్శించిన మంత్రి ఐకే రెడ్డి