యూఎస్ కాన్సుల్ జనరల్ జోయెల్ రీఫ్మన్
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 6 (నమస్తే తెలంగాణ): అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించేందుకు వచ్చే భారత విద్యార్థులకు అత్యంత ప్రాధాన్యమిస్తామని యూఎస్ కాన్సుల్ జనరల్ జోయెల్ రీఫ్మన్ చెప్పారు. జూబ్లీహిల్స్లో వై యాక్సిస్ ఫౌండేషన్ కార్యాలయంలో నూతన విద్యాసేవా కేంద్రాన్ని ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జేవియర్ అగస్టీన్, యూఎస్ ఎంబసీ పబ్లిక్ ఎఫైర్స్ మినిస్టర్ కౌన్సిలర్ డేవిడ్ కెన్నెడీతో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. అమెరికాలో నాలుగు వేల కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఉన్నాయని, విద్యాపరంగా భారత్తో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నామని తెలిపారు.