న్యూఢిల్లీ: “గుడ్డి నేతలకు ప్రజల బాధలు, చావులూ ఏవీ పట్టవు. మనం క్రూరమైన, మొండిబారిన జాతిగా తయారవుతున్నాం”. కోవిడ్తో విద్యార్థి మృతి చెందడంపై ఢిల్లీ సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ చేసిన వ్యాఖ్యలివి. రాజస్థాన్కు చెందిన సత్యం ఝా (18) ఏప్రిల్ చివరి వారంలో స్వస్థలం కోటా వెళ్లాడు. తర్వాత అక్కడే ఉంటూ ఆన్లైన్ క్లాసులకు అటెండ్ అవుతున్నాడు. బాధితులకు సాయపడడంలో ఎప్పుడూ ముందుండేవాడు. ఇంతలో కరోనా సోకింది. 8 రోజులపాటు వెంటిలేటర్పై గడిపి గురువారం సాయంత్రం కన్నుమూశాడు. అతనితోపాటే అతని తల్లిదండ్రుల కలలు అంతమైపోయాయి అని ప్రిన్సిపాల్ జాన్ వర్ఘీసే కాలేజీ వెబ్సైటులో ఉద్వేగభరితమైన వ్యాఖ్యలు పెట్టారు. ప్రియమైన వ్యక్తుల మరణం ముందు నేతల అధికారాలు, అందలాలు ఏం చేసుకోవడానికి? అని ఆయన ప్రశ్నించారు. భవిష్యత్తులోకి ఆశావహంగా చూస్తున్న ఓ యువకుడు ఇక లేడు అని ఆయన తన మెసేజ్లో పేర్కొన్నారు. కాలేజీలోని గాంధీ-అంబేడ్కర్ విద్యార్థి సంఘం కూడా సత్యం మృతి పట్ల సంతాపం తెలిపింది.