లండన్: క్వీన్ ఎలిజబెత్ భర్త, ప్రిన్స్ ఫిలిప్ శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయసు 99 సంవత్సరాలు. విండ్సర్ కాజిల్లోనే డ్యూక్ ఆఫ్ ఎడిన్బర్గ్ తుది శ్వాస విడిచారు. ఇన్ఫెక్షన్ కారణంగా మూడు వారాల కిందట ఆయన లండన్లోని ఓ ఆసుపత్రిలో చేరారు. నేవీ ఆఫీసర్గా పని చేసిన ఫిలిప్.. 1947లో ఎలిజబెత్ను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఐదేళ్లకే ఆమె బ్రిటన్ సింహాసనాన్ని అధీష్టించారు. ఆయన మరణ వార్తను బకింగ్హామ్ ప్యాలెస్ ఓ ప్రకటనలో వెల్లడించింది.
తన భర్త, డ్యూక్ ఆఫ్ ఎడిన్బర్గ్ ప్రిన్స్ ఫిలిప్ చనిపోయినట్లు క్వీన్ ప్రకటించారని బకింగ్హామ్ ప్యాలెస్ తెలిపింది. శుక్రవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచినట్లు చెప్పింది. ఈ ఏడాది జూన్ 10న ప్రిన్స్ ఫిలిప్ 100వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడానికి సిద్ధమవుతున్న సమయంలో ఈ విషాదం చోటు చేసుకుంది. ప్రిన్స్ ఫిలిప్, క్వీన్ ఎలిజబెత్కు నలుగురు సంతానం. కరోనా వైరస్ ప్రపంచాన్ని చుట్టుముట్టినప్పటి నుంచీ ఆయన క్వీన్తో కలిసి విండ్సర్ కాజిల్లోనే ఉంటున్నారు.
ఇవి కూడా చదవండి
వైరల్ ఫొటో.. ఆ ముస్లిం వ్యక్తి మోదీ చెవిలో ఏం చెప్పాడో తెలుసా?
త్వరలోనే ఇండియాలో సింగిల్ డోస్ వ్యాక్సిన్.. ప్రభుత్వంతో జే&జే చర్చలు
మా రోమియోలంటే మాకిష్టం.. యోగికి టీఎంసీ ఎంపీ కౌంటర్
ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీకి స్పెషల్ గెస్ట్లు.. ఎవరో తెలుసా?
ముంబై vs బెంగళూరు.. తుది జట్లు ఇవే!
భయం లేదు.. రైళ్లు కొనసాగుతాయి!
యూఎస్ నేవీ దుస్సాహసం.. భారత జలాల్లో ఆపరేషన్