న్యూఢిల్లీ: దేశంలో 2022, ఆగస్టు 15న జరుగనున్న 75వ స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకుని 75 వారాలపాటు నిర్వహించతలపెట్టిన ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రామానికి ప్రధాని నరేంద్రమోదీ శ్రీకారం చుట్టారు. ఈ మేరకు గుజరాత్లోని అహ్మదాబాద్లో ఏర్పాటు చేసిన ఓ భారీ కార్యక్రమంలో ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వెబ్సైట్ను లాంచ్ చేశారు.
అనంతరం సబర్మతి ఆశ్రమం వద్ద జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. దండియాత్ర నిర్వహించి 91 ఏండ్లు అయిన సందర్భంగా చేపట్టిన ఈ పాదయాత్ర కూడా దండి వరకు సాగనుంది. 81 మందితో ప్రారంభమై 25 రోజులపాటు 241 కిలోమీటర్ల మేర యాత్ర జరుగుతుంది. మార్గమధ్యంలో వివిధ వర్గాల ప్రజలు ఈ దండి మార్చ్లో భాగస్వామ్యం కానున్నారు. ఈ యాత్రకు కేంద్రమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ నేతృత్వం వహించనున్నారు.