న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లలో పెట్రో ధరలు భారీగా పెరిగాయని, ఆ ప్రభావమే దేశీయ మార్కెట్లపై పడిందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. చలికాలంలో ప్రపంచవ్యాప్తంగా అన్నిదేశాల్లోనూ పెట్రోలియం ఉత్పత్తులకు డిమాండ్ భారీగా ఉంటుందని, ఆ డిమాండ్ కారణంగానే వినియోగదారులు ధరాభారం మోయాల్సిన పరిస్థితి నెలకొన్నదని మంత్రి తెలిపారు. పెట్రో ధరల పెంపునకు దేశీయ పరిస్థితులు ఏమాత్రం కారణం కాదని ఆయన చెప్పారు. శీతాకాలం పోతే పెట్రో ఉత్పత్తులకు డిమాండ్ తగ్గుతుందని, దాంతో ధరలు దిగివస్తాయని మంత్రి ప్రధాన్ వెల్లడించారు.