న్యూఢిల్లీ/హైదరాబాద్, సెప్టెంబర్ 16: పసిడి ధరలు దిగొస్తున్నాయి. దేశవ్యాప్తంగా తులం బంగారం ధర రూ.50 వేల దిగువకు పడిపోయాయి. శుక్రవారం ఢిల్లీలో రూ.810 తగ్గిన తులం ధర రూ.49,450కి దిగొచ్చింది. కిలో వెండి ఏకంగా రూ.1,380 తగ్గి రూ.55,990కి దిగొచ్చింది. అటు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల తులం ధర రూ.440 తగ్గి రూ.49,960కి దిగొచ్చింది. అలాగే 22 క్యారెట్ల ధర రూ.400 దిగి రూ.45,800గా నమోదైంది. వెండి మాత్రం పెరిగింది. కిలో వెండి రూ.500 అధికమై రూ.61,650 పలికింది. వరుసగా మూడు రోజుల్లో పసిడి వెయ్యి రూపాయలకు పైగా తగ్గినట్లు అయింది. పలు దేశాలు మరోసారి మాంద్యంలోకి జారుకునే అవకాశాలు ఉన్నట్లు అంతర్జాతీయ ద్రవ్యనిధి, వరల్డ్ బ్యాంక్ అంచనాలను విడుదల చేశాయి. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,655 డాలర్లకు, వెండి 18.84 డాలర్లకు పడిపోయాయి.